Published On:

3 People died in Srikakulam: జాతరలో విషాదం.. కరెంట్ షాక్ తో ముగ్గురు దుర్మరణం

3 People died in Srikakulam: జాతరలో విషాదం.. కరెంట్ షాక్ తో ముగ్గురు దుర్మరణం

3 People died in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కంచిలి మండలం పలపంపర గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో కరెంట్ షాక్ వల్ల ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. గ్రామదేవతల ఉత్సవాల్లో లైటింగ్ డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తెగి కిందపడటంతో ఘటన జరిగింది. తీవ్రగాయాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా జాతరలో విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోవడంపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతరలో ఇలా జరగడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.