Andhra Pradesh: విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం!.. ఇద్దరు అరెస్ట్

Terroists in vizianagaram Andhra Pradesh: ఏపీలోని విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఉగ్రవాదానికి ఇద్దరు ఆకర్షితులైనట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
వివరాల ప్రకారం.. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)పై గత కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు విచారించగా.. అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్(28)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.