Last Updated:

Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

Road Accident : ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద ఈరోజు ( మే 27, 2023 ) తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ క్రమం లోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాపరాళ్ల లోడ్‌లో లారీ మాచర్ల నుంచి రేపల్లె.. వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని గుర్తించారు.

ఇక ఈ ప్రమాదంలో గాయపడినవారిని ప్రస్తుతం రేపల్లే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. మృతులను పల్నాడు జిల్లా మాచర్లకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.