Road Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో కారును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం!

6 Killed Road Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలంలోని తాటి చెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు బాపట్ల జిల్లా స్టువర్ట్పురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా తీవ్రంగా కష్టపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- Needle Free Blood Testing in Nilofar: నీలోఫర్ ఆసుపత్రిలో AIతో సూదిరహిత రక్త పరీక్షలు.. దేశంలోనే తొలిసారి!