Road Accident in Telugu States: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం

5 Died in Telugu States Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.
వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలంలోని పోదొడ్డి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. సంతోష్(47), లోకేశ్(37), నవీన్(37) ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే తెలంగాణలోని ములుగు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయిలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతులు శ్వేత(40), దుర్గ(30)గా గుర్తించారు. వీరంతా మేడారం వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంోల గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ములుగు జిల్లాలోని తాడ్వాయి వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ములుగు జనరల్ హాస్పిటల్, ఎంజీఎం సూపరింటెండెంట్లతో ఇవాళ ఉదయం ఫోన్లో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.