Published On:

Rains: ఏపీలో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rains: ఏపీలో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

AP: ఏపీలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడొచ్చని సూచించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని హెచ్చరించింది.

 

ముఖ్యంగా ఇవాళ కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రేపు పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.