Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యేల సస్పెన్షన్పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Kotamreddy Sridhar Reddy : ఏపీలో రాజకీయాలు మంచి జోరందుకుంటున్నాయి. ఇన్నాళ్ళూ అధికార – ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు గాను సస్పెండ్ అయిన నేతలు జగన్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడు వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా మాట్లాడినప్పుడు.. దానిని వైసీపీ పెద్దలు రాజకీయ కోణంలో చూసి తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. తనను అనుమానించిన చోట ఉండకూడదని భావించి వైసీపీకి దూరంగా జరిగాననని చెప్పారు. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలియజేయడం జరిగిందని తెలిపారు. తాను పార్టీకి దూరంగా జరిగినప్పుడు సస్పెండ్ చేయడయమనేది సమర్థనీయం అని చెప్పారు. అయితే సస్పెండ్ చేసిన విధానం సరైనది కాదని తెలిపారు. ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే.. ముందు షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలని కోటంరెడ్డి అన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేసేందుకు వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే సస్పెన్షన్తో తనకు వచ్చే నష్టమేమి లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు డిస్మిస్ చేయడం పక్కా – కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy)
ఇవి కూడా చదవండి:
- Mark Zuckerberg: మూడోసారి తండ్రి అయిన మెటా సీఈఓ
- Megastar Chiranjeevi : “రంగమార్తాండ” మూవీ ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది – చిరంజీవి
- Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్