Last Updated:

CM Jagan: పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే.. ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్  గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తోంది.

CM Jagan: పిల్లలకు ఇచ్చే ఆస్తి  చదువు మాత్రమే.. ఏపీ సీఎం జగన్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్  గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తోంది.

మానవ వనరులపై పెట్టుబడి..(CM Jagan)

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.ప్రభుత్వం విద్యా సంస్కరణలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,34,285 మంది విద్యార్థులకు రూ.620 కోట్ల విలువైన ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది. ప్రతి మండలంలో పంపిణీని ఎమ్మెల్యేలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. రూ. 15,500 విలువైన బైజు కంటెంట్‌తో లోడ్ చేయబడిన ఒక్కో ట్యాబ్ ధర రూ. 33,000. విద్యపై పెట్టుబడి భవిష్యత్తులో మానవ వనరులపై ఉత్పాదక పెట్టుబడి అవుతుందన్నారు. స్టడీ మెటీరియల్ లోడ్ చేయబడిన ట్యాబ్‌లు విద్యార్థులకు ట్యూటర్‌లుగా మార్గనిర్దేశం చేస్తాయి.వారి భవిష్యత్తును మంచిగా మారుస్తాయి. ట్యాబ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స సహాయక సందేహ నివృత్తి మరియు విదేశీ భాషల యాప్‌లు వంటి ఉపయోగకరమైన అప్లికేషన్‌లు ఉంటాయి. ఇవి వారి జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. అయితే కొంతమంది పిల్లల చేతిలో ట్యాబ్ లు పెడితే చనిపోతారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. పేద పిల్లలు ట్యాబ్ లు వాడుతుంటే, ఇంగ్లీషు మీడియంలో చదివితే మీకెందుకు కడుపుమంట అంటూ జగన్ ప్రశ్నించారు

తరగతి గదుల డిజిటలైజేషన్..

తల్లిదండ్రులు తమ పిల్లలు ట్యాబ్ లను ఎలా ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేయగలరని జగన్ అన్నారు. వరుసగా రెండో సంవత్సరం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1,306 కోట్ల విలువైన 9, 52, 925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. విద్యార్థుల ప్రమాణాలను మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ట్యాబ్‌ల పంపిణీ కూడా ఒకటి అని జగన్ అన్నారు. జనవరి చివరి నాటికి 62,097 తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తవుతుందన్నారు. ఇది విద్యార్థులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. విద్యా దీవెన, అమ్మ వోడి మరియు వసతి దీవెన కూడా ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని సీఎం జగన్ వివరించారు.