Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట తీవ్ర విషాదం

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జాన్వీ నాన్నమ్మ.. నిర్మాత బోనీ కపూర్ తల్లి నిర్మలా కపూర్ మృతి చెందింది. గత కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె నేటి సాయంత్రం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కపూర్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
నిర్మలా కపూర్ కు ముగ్గురు సంతానం. బోణీ కపూర్,అనిల్ కపూర్ సంజయ్ కపూర్, రీనా కపూర్. బోనీ కపూర్.. మొదట అర్జున్ కపూర్ తల్లి మోనాను వివాహమాడాడు. ఆ తరువాత శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ, ఖుషీ సంతానం. శ్రీదేవి మరణించాకా.. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు నాన్నమ్మతోనే ఎక్కువ బంధాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా మరణించడంతో జాన్వీ, ఖుషీ మారినంత ఒంటరివారయ్యారు.
నిర్మలా కపూర్ మరణించింది అన్న వార్త తెలియడంతో కపూర్ కుటుంబం అంతా హుటాహుటినా బోనీ ఇంటికి చేరుకుంటున్నారు. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులు కపూర్ ఫ్యామిలీకి ధైర్యం చెప్తూ.. నిర్మలా కపూర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జాన్వీ కపూర్ కెరీర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం తెలుగులో జాన్వీ పెద్ది సినిమాతో బిజీగా మారింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దేవరతో ఎంట్రీ ఇచ్చి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ చిన్నది పెద్దితో బారి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.