Road Accident: దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా బాధితులు శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఘటనలో 21 మందికి గాయాలు కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితులంతా ఆదోనికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోవడంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడం బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మృతుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపుతున్నాను”. అని అన్నారు.