Published On:

Sheikh Hasina: నన్ను కాల్చి చంపి.. గణబంధన్‌లో పాతిపెట్టండి: అధికారం కోల్పోయే ముందు షేక్‌ హసీనా

Sheikh Hasina: నన్ను కాల్చి చంపి.. గణబంధన్‌లో పాతిపెట్టండి: అధికారం కోల్పోయే ముందు షేక్‌ హసీనా

Bangladesh Ex PM Sheikh Hasina: బంగ్లాలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. దీంతో నాటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపై అరెస్టు వారెంట్‌లు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రైబ్యునల్‌కు కీలక విషయాలు వెల్లడించారు.

 

బంగ్లాదేశ్‌లో అర్లర్లు తీవ్రతరం కావడంతో గతేడాది ఆగస్టు 4న సైనికాధికారులు హసీనా నివాసానికి వెళ్లి రాజీనామా చేయాలని కోరినట్లు ఇస్లాం పేర్కొన్నారు. అప్పటి అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు అగ్ర నాయకులు దీన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలని పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ఆమెకు సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ దేశాన్ని వీడాలనే సూచనను హసీనా అంగీకరించలేదన్నారు. పారిపోవడం కంటే తనను అక్కడే కాల్చి చంపేమయని, గణబంధన్‌లోనే పాతి పెట్టమని సైనికాధికారులను కోరినట్లు తెలిపారు. ఇష్టం లేకపోయినా.. అధికారుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితుల్లో హసీనా దేశం వీడారని ట్రైబ్యునల్‌కు తెలిపారు.

 

బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆమెపై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలో హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పలుమార్లు భారత్‌కు దౌత్య సందేశాలు పంపింది.

 

ఇవి కూడా చదవండి: