Published On:

US Warning to Foreign Students: తరగతులు ఎగ్గొట్టినా వీసా రద్దు.. విదేశీ స్టూడెంట్స్‌కు అమెరికా వార్నింగ్!

US Warning to Foreign Students: తరగతులు ఎగ్గొట్టినా వీసా రద్దు.. విదేశీ స్టూడెంట్స్‌కు అమెరికా వార్నింగ్!

US Government warning to foreign Students: విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. పలు కారణాలతో వీసాలు రద్దు చేస్తూ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా తాజాగా మరో హెచ్చరిక చేసింది. తమ విద్యా సంస్థల్లో చదివే భారత్‌ సహా విదేశీ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా వీసాలు రద్దు చేస్తామని గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. భారత్‌లోని అమెరికా ఎంబసీ దీనిపై మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.

 

విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్‌ అయినా..

కళాశాలల నుంచి డ్రాపౌట్‌ అయినా.. తరగతులు ఎగ్గొట్టినా వీసా రద్దు యూఎస్‌ ఎంబసీ ప్రకటనలో వెల్లడించింది. విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా స్టూడెంట్‌ వీసా రద్దవుతుందని చెప్పింది. భవిష్యత్‌లో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, విద్యార్థి వీసాను కొనసాగించుకోవాలని వెల్లడించింది.

 

న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు..

విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న వారి దగ్గర నుంచి చిన్న చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలు కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపించేస్తున్నారు. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. దీనిపై ఆయా విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

 

ఆప్టికల్‌ ప్రాక్టికల్‌ శిక్షణ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులకు ఇటీవల ఇమిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హెచ్చరించింది. ఓపీటీ శిక్షణను ప్రారంభించిన 90 రోజుల్లోగా ఉపాధిపై స్టేటస్‌ తెలియజేయాలని, లేకపోతే చట్టబద్ధ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. ఈ క్రమంలో తాజా ప్రకటన వెలువడటంతో విదేశీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.

 

విదేశాల్లో 18 లక్షల మంది భారతీయ విద్యార్థులు..

విదేశాల్లో ఇండియా విద్యార్థుల సంఖ్య 2025లో విద్యార్థుల సంఖ్య 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. 2023లో 13 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు చదువుతున్నారు. కొంతకాలంగా వీరి సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కెనడా, యూకేలో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది యూఎస్‌లో రికార్డు స్థాయిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కెనడాలో 1,37,608 మంది విద్యార్థులు, యూకేలో 98,890 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: