India Pakistan War: ప్రధానిని పక్కకు నెట్టి భారత్ తో పాక్ ఆర్మీ యుద్ధం!

India Pakistan Ceasefire Violation: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. ఒక పైపు సంధి అంటూనే మరోవైపు కాల్పులకు తెగబడింది. ప్రధానికి తెలియకుండానే పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 8గంటల 39 నిముషాలకుపాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన నిముషాల వ్యవధిలోనే పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. ట్రంప్, జెడి వాన్స్, మార్కో రుబియోలకు పాక్ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించినందుజు కృతజ్ఞతలు తెలిపారు. పాక్ ప్రధాని ట్వీట్ చేసే సమయానికే భారత్ పై పాకిస్తాన్ ఆర్మీ దాడులు మొదలు పెట్టింది. ఆర్మీ చేతిలో పాక్ ప్రధాని కీలుబొమ్మగా మారినట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతోంది తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిం మునీర్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించినట్టు సమాచారం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
పాకిస్థాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో.. కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు తగిన పాక్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. సరిహద్దుల దగ్గర సాయుధ దళాలు గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట..ఉల్లంఘనలు పునరావృతమైతే.. సమర్థవంతంగా ఎదుర్కోవాలని భద్రతా బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్ పై విధించిన అన్ని ఆంక్షలు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. సిందూ జలాల విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని.. నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చర్చల తర్వాతే ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉగ్రవాదంపై పాక్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై భారత్ నిరంతరం యుద్ధం చేస్తుందని తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఉగ్రదాడులను యుద్ధంలాగే చూస్తామని.. దానికి తగినట్టే స్పందిస్తామని తేల్చి చెప్పింది.