Published On:

Air India: ఇజ్రాయెల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో మిస్సైల్ దాడి.. భారత్ విమానాల మళ్లింపు

Air India: ఇజ్రాయెల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో మిస్సైల్ దాడి.. భారత్ విమానాల మళ్లింపు

Israel: ఇజ్రాయెల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో బాలిస్టిక్ మిస్సైల్ దాడి జరిగింది. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా హౌతీ ఉగ్రవాదులు ప్రయోగించిన క్షిపణి విమానాశ్రయం దగ్గర్లో పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమాన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దాడిలో 8 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు

కాగా దాడిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందించారు. దాడికి తగిన ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించారు. “ఎవరైతే మాకు హాని చేస్తారో, మేము వారికి ఏడు రెట్లు హాని చేస్తాము” అని అన్నారు.

కాగా ఇజ్రాయెల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో క్షిపణి దాడి జరగడంతో ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు. అంతేకాక ఢిల్లీ- టెల్ అవీవ్ మధ్య మే 6 వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ139 టెల్ అవీవ్ లో ల్యాండ్ కావడానికి కొద్ది సమయం ముందే దాడి జరగడం గమనార్హం. ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకునేందుకు లేదా పూర్తి నగదు తిరిగి చెల్లించుకునేందుకు నిర్ణయించింది.