Published On:

Air India Plane Crash Ahmedabad: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతులు

Air India Plane Crash Ahmedabad: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతులు

Dead Count reached to 274 in Air India Plane Crash Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 242 ప్రయాణికులు లండన్ ప్రయాణిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. దీంతో అందులో 241 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాసీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతిచెందాడు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది.

 

తాజాగా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. అహ్మదాబాద్‌లో ఈ నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అందులో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతిచెందారు. ఈ విమానం వైద్యకళాశాల భవనంపై కూలడంతో మరో 24 మంది విద్యార్థులు మృతిచెందారు. మొత్తంగా ఈ ప్రమాదంలో గురువారం వరకు 265 మంది దుర్మరణం చెందారు. వైద్య కళాశాల భవనంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో తాజాగా మరో 9 మంది విద్యార్థులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 274కు చేరింది.

 

దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ..

విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతస్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటి గగనతల ప్రమాదాలు జరగకుండా కఠినమైన ఫ్రేమ్‌వర్క్‌ను కమిటీ ప్రతిపాదించనుంది. కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను అధికారులు గుర్తించారు. బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై దొరికింది. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను తెలుసుకోనున్నారు.

 

ఇవి కూడా చదవండి: