The Raja Saab Teaser: ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే అప్డేట్.. ది రాజాసాబ్ టీజర్ వచ్చేస్తోంది

Prabhas The Raja Saab Teaser Releasing on June Second Week: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కితోంది. నిజానికి ముందు నుంచి ఈ చిత్రంపై పెద్దగా బజ్ లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్లో దూసుకుపోతున్న ప్రభాస్.. మారుతితో సినిమా చేయడమేంటని అంతా షాక్ అయ్యారు. అసలీ ప్రాజెక్ట్ అంత ఊహాగానాలే అనుకున్నారు. మూవీ టీం కూడా సైలెంట్గా సినిమాని సెట్స్పైకి తీసుకువచ్చింది.
షూటింగ్ కొంత పూర్తి చేసుకున్న తర్వాత మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు. ఇక ఈ చిత్రం నుంచి ప్రభాస్ పోస్టర్స్, లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చాడు మారుతి. ఈ పోస్టర్స్కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై భారీ బజ్ నెలకొంది. ప్రభాస్ బర్త్డే సందర్బంగా రిలీజ్ చేసిన గ్లింప్స్తో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అప్పటి నుంచి ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి సైలెంట్ సర్ప్రైజింగ్ ట్వీట్ వదిలారు. అంతా పహల్గాం దాడి ఘటన, ఆపరేషన్ సిందూర్పై చర్చిస్తుంటే.. త్వరలోనే సర్ప్రైజ్ రానుందంటూ ట్వీట్ చేశాడు.
ఈ విషయంలో కాస్తా ఆయన ట్రోల్స్ బారిన పడ్డ.. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మాత్రం అదిరిపోయేది ఏదో రెడీ చేశారని అంచన వేశారు. ఆ ట్వీట్ చూసి అంతా ఇది ది రాజాసాబ్ టీజర్ గురించే అయ్యింటుందని అభిప్రాయపడ్డాను. అనుకున్నట్టుగానే త్వరలోనే మూవీ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనిపై బేబీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ (SKN) అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తాజాగా ఓ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయనకు ప్రభాస్ రాజాసాబ్ టీజర్ ఎందుకు ఆలస్యం అవుతుంది? అని విలేకరులు ప్రశ్నించారు.
దీనికి అతడు స్పందిస్తూ.. “వస్తుంది.. త్వరలోనే టీజర్ వస్తుంది. ఇప్పటికే రఫ్ కట్ అంతా రెడీ అయిపోయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా ది రాజా సాబ్ మూవీని రూపొందిస్తున్నారు. రెండు వారాల్లోనే టీజర్ రిలీజ్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతికథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.