Published On:

Kantara Chapter 1: కాంతార: ఛాప్టర్‌ 1 సెట్‌లో ప్రమాదం.. కారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ!

Kantara Chapter 1: కాంతార: ఛాప్టర్‌ 1 సెట్‌లో ప్రమాదం.. కారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ!

Kantara Chapter 1 Movie Makers Reacts on Boat Capsizes: కన్నడ హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. 2022లో విడుదలైన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్‌గా వస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్‌లో ప్రమాదం జరిగింది, 20 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందంటూ మీడియాలో రకరకాలు కథనాలు వస్తున్నాయి. అంతేకాదు ఆ సమయంలో హీరో రిషబ్‌ శెట్టి కూడా పడవలోనే ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.

 

కాంతార సెట్లో ప్రమాదమంటూ వస్తున్న వార్తలపై తాజాగా మూవీ టీం స్పందింది. కాంతార నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఆదర్స్‌ దీనిపై మాట్లాడారు. ప్రస్తుతం కాంతార చాప్టర్‌ 1 మూవీ షూటింగ్‌ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోందన్నారు. “ఈ సినిమా సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుందంటూ మీడియాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్‌ వేశామని, అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందన్ని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్‌లో నటీనటులు కానీ, సిబ్బంది కానీ లేరన్నారు.

 

ఇవాళ షూటింగ్‌ యథవిధిగా కొనసాగుతుంది. షూటింగ్‌ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండ ముందస్తు చర్యలు తీసుకున్నామని, గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్‌ సమక్షంలోనే మూవీ షూటింగ్‌ జరుగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో రిషబ్‌ శెట్టి ఫ్యాన్స్‌ ఊపీరి పీల్చుకున్నారు. కాగా రిషబ్‌ శెట్టి కూడా ప్రమాద సమయంలో పడవలోనే ఉన్నారని వార్తల్లో పేర్కొనడంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమం గురించి అంత ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతే స్వయంగా స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడం రిషబ్‌ శెట్టి ఫ్యాన్స్‌ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.