Published On:

Manchu Vishnu about Prabhas: ‘కన్నప్ప’లో అతిథిగా ప్రభాస్‌.. డార్లింగ్ రోల్‌పై విష్ణు ఆసక్తికర కామెంట్స్‌!

Manchu Vishnu about Prabhas: ‘కన్నప్ప’లో అతిథిగా ప్రభాస్‌.. డార్లింగ్ రోల్‌పై విష్ణు ఆసక్తికర కామెంట్స్‌!

Manchu Vishnu Revealed Prabhas Role Duration in Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల ఇంక నెల రోజుల ఉండటం మంచు విష్ణు ప్రమోషన్స్‌ జోరు పెంచాడు. వరుస ఇంటర్య్వూలో అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తోంది మూవీ టీం. త్వరలో ఈ చిత్రం నుంచి ఓ భక్తి పాట విడుదల కానుంది.

 

మరోవైపు విష్ణు వరుసగా ఇంటర్య్వూలో ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో అతడు ముచ్చటించాడు. ఈ సందర్భంగా కన్నప్ప మూవీ విశేషాలను పంచుకుంటూ.. ప్రభాస్‌ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ సినిమా ప్రభాస్‌ రుద్ర పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని, దాదాపు 30 నిమిషాల పాటు ఆయన పాత్ర ఉంటుందని అన్నాడు. “కన్నప్ప రన్‌టైం 3 గంటల 10 నిమిషాలకు లాక్‌ అయ్యింది. కన్నప్ప పరివర్తనలో కలీకల పాత్ర పోషించే దైవిక వ్యక్తిగా ప్రభాస్‌ నటించారు.

 

ప్రభాస్‌, మోహన్‌ బాబు మధ్య ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. మోహన్‌ లాల్‌ పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆ రోల్‌ బలమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటానికి కారణం వీఎఫ్‌ఎక్స్‌ అని అన్నారు. ఈ సినిమాకు షూటింగ్‌ అంతా బాగానే పూర్తయ్యింది. కానీ వీఎఫ్‌ఎక్స్‌లో సాంకేతిక వర్క్‌కి పెద్ద పరిణతి లేని వ్యక్తిని తీసుకున్నాం. కన్నప్ప విషయంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు అదే. అతడిని తీసుకుని చాలా పెద్ద తప్పు చేశాననన్నాడు.

 

కాగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్‌, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌, మోహన్‌ లాల్‌తో పాటు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌లు అతిథి పాత్రల్లో నటిస్తుండగా.. మోహన్‌ బాబు, అర్పిత్‌ రంకా, ప్రీతి ముఖుందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 28న శ్రీ-కాళహస్తి అనే పాట విడుదల కానుంది. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడగా.. స్టీఫెన్‌ దేవస్సీ సంగీతం అందించారు.