Dil Raju Press Meet on Theaters Bundh: థియేటర్ల బంద్ సమస్య అక్కడే మొదలైంది.. తెలంగాణలో నాకున్నవి 30 థియేటర్లు మాత్రమే: దిల్ రాజు కామెంట్స్

Dil Raju Reacted on Theatres Bandh Issue: థియేటర్లక వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ విషయంలో ఓ నలుగు ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు వివరణ ఇచ్చేందుకు తాను మీడియా ముందుకు వచ్చానన్నారు. టాలీవుడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
థియేటర్ల సమస్య అక్కడే మొదలైంది
“కొన్ని ప్రశలకు సమాధనాలు చెప్పాలి. అందుకే ఈ ప్రెస్మీట్. అసలు విషయం ఎలాంటి పక్కదారి పట్టకుండ, ఎలాంటి వివాదస్పద ప్రశ్నలకు తావులేకుండ సూటిగా మాట్లాడుకుందాం. అసలు సమస్య తూర్పుగోదావరి జిల్లా మొదలైంది. అక్కడి ఎగ్జిబిటర్లు, డిస్ట్రీబ్యూటర్లు ఏప్రిల్ల్లో థియేటర్ల పర్సంటేజీల విషయంలో సమావేశం అయ్యారు. ఇందులో ఉన్న సమస్యలను మా దృష్టికి కూడా తీసుకువచ్చారు. నిజంగా పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ గురించి ఈ సందర్బంగా వారిని అడిగాం. పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని వారు అంటున్నారు.
పవన్ సినిమాలను ఆపే దమ్ము ఎవరికి లేదు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ లేదా పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాం. రెండో వారం నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి కాబట్టి పర్సంటేజ్లో ఇస్తున్నాం. అది వారికి కష్టమైనదే అని మాకు తెలుసు. ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఇంక సమస్య పరిష్కరం రాలేదు” అని చెపపుకొచ్చారు. “థియేటర్ల బంద్ అంశం నడుస్తున్న టైంలోనే హరి హర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. తర్వాత డేట్ను లాక్ చేయడానికి ముందే థియేటర్ల వివాదం మొదలైంది. దీంతో హరి హర వీరమల్లు మూవీ విషయంలో తప్పుగా వెళ్లింది. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయనకు నేను క్లారిటీ ఇచ్చాను. థియేటర్లు మూసి వేయరని స్పష్టంగా చెప్పాను.
370లో నాకు 30 థియేటర్లే ఉన్నాయి: దిల్ రాజు
తప్పుడుగా సమాచారం వచ్చిందని ఆయనకు వివరించా. జాన్ నెలంతా పెద్ద సినిమాలున్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే అందరి తపన” అన్నారు. “పర్సంటేజ్ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది. నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే అందుంలో ఎస్వీసీఎస్తో పాటు మరిన్నింటికి కలిపి మొత్తం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఏషియల్, సునీల్, సురేష్ కంపెనీలకు కలిపి 90 ఉన్నాయి. 370లో ఇండస్ట్రీలోని వారికి 120 ఉంటే మిగిలిన 250 థియేటర్లు ఆయన ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. కానీ ఈ వ్యవహరంలో ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తోంది. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ తీసుకోండి” అని ఆయన చెప్పుకొచ్చారు.