Karachi Port: 53 ఏళ్ల తర్వాత.. కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ భీకర దాడి..!

Indian Navy Attack on Karachi Port: కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికాదళం దాడి జరిపింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయలాంటిది. ఇటువంటి ఓడరేపు పై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత కరాచీ ఓడరేవుపై దాడి జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై కొంత గందరగోళం నెలకొంది. కాగా, దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
కరాచీ ఓడరేవు, పాకిస్తాన్ నౌకాదళానికి గుండెకాయలాంటిది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో కరాచీ ఓడరేవు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత భద్రతా బలగాలు ఇటీవల ఈ ఓడరేవుపై దాడి జరిపినట్లు వార్తా కథనాలు వచ్చాయి. పాకిస్తాన్ దాడులకు ప్రతిగా భారత్ కూడా ప్రతీకార దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతీకార దాడుల్లో భాగంగానే కరాచీ ఓడరేవుపై ఇండియన్ నేవీ భీకర దాడి జరిపినట్లు వార్తలు వచ్చాయి.ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఇందుకు ఉపయోంచినట్లు తెలిసింది.
వాస్తవానికి కరాచీ ఓడరేవుతో భారత నావికాదళానికి పాత ఎనిమిటీ ఉంది. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం లో భాగంగానే అప్పట్లో కరాచీ ఓడరేవుపై భారత నౌకాదళం దాడులు జరిపింది. అ తరువాత మళ్లీ ఇటీవల ఇండియన్ నేవీ దాడులు జరిపింది. అంటే దాదాపు 53 సంవత్సరాల తరువాత అన్నమాట.
పహల్గామ్ దారుణ మారణకాండకు ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. అయితే ఆపరేషన్ సింధూర్ లో కేవలం పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కేంద్రంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. ఎక్కడా పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోలేదు. పూర్తి సంయమనంతో భారతదేశం వ్యవహరించింది. భారత్ చూపిన సంయమనాన్ని ప్రపంచదేశాలు అభినందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అసలు కరాచీ ఓడరేవు పై దాడి నిజంగా జరిగిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సహా భారతదేశం చేపట్టే అన్ని మిలటరీ కార్యకలాపాలను తెలియచేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గర ఒక అధికారిక హ్యాండిల్ ఉంది. అయితే కరాచీ ఓడరేవుపై దాడి జరిగినట్లుగా ఇప్పటివరకు భారత్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మొత్తం మీద కరాచీ ఓడరేవు అటాక్ అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.