Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

Operation Sindoor Director Apologizes for Movie Announcement: ఆపరేషన్ సిందూర్ టైటిల్తో బాలీవుడ్లో ఓ సినిమా రానుంది. దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. కొన్ని గంటల క్రితమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ. అయితే టైటిల్ పోస్టర్ విడుదలైన కాసేపటికి డైరెక్టర్ క్షమాపణలు చెప్పారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ సినిమాని అనౌన్స్ చేయడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అది నా ఉద్దేశం కాదు..
సమయం సందర్భంగా లేకుండ టైటిల్ ప్రకటించడాన్ని తప్పు బడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో డైరెక్టర్ క్షమాపణలు చెబుతూ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఎదుటి వ్యక్తి మనోభవాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. డబ్బు లేదా ఫేం కోసం తాను ఇలాంటి పని చేయలేదన్నారు. “మన భారత సాయుధ దళాలు వీరోచితంగా పోరాడిన ఆపరేషన్ సిందూర్ ఆధారంగా ఒక సినిమాను ఇటీవల ప్రకటించినందుకు నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా. ఎవరీ మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు.
డబ్బు, ఫేం కోసం చేయలేదు..
ఒక చిత్ర నిర్మాతగా మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని, నాయత్వాన్ని ఒక పవర్ఫుల్ కథగా వెండితెరపైకి తీసుకురావాలని అనుకున్నా. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని, ప్రేమ నుంచి పట్టిందే ఈ ప్రాజెక్ట్. అంతేకాని డబ్బు, ఫేం, కోసం ఈ సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా టైటిల్ ప్రకటించడం వల్ల కొంతమందికి అసౌకర్యానికి గురయ్యారని అర్థమౌవుతుంది. దీనికి నేను చింతిస్తున్నాను. అయితే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇది దేశ పరజల ఎమోషన్” అని ఆయన రాసుకొచ్చారు. కాగా ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదలు జరిపిన దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
హిందువులు టార్గెట్గా పురుషులను కాల్చి చంపారు. పలువురు మహిళలు తమ కళ్ల ముందే భర్తలను పొగొట్టుకున్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. దీంతో ఆపరేషన్ సిందూర్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ భారత భద్రత దళాల తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ పవర్ఫుల్ టైటిల్తో సినిమా తీసేందుకు ఎన్నో నిర్మాణ సంస్థలు టైటిల్ కోసం పోటీ పడ్డాయి. ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకునేందుకు జీ- సినిమాస్, టీ-సిరీస్తో పాటు పలు అగ్ర సంస్థలు పోటీ పడ్డాయి. ఫైనల్ నిక్కీ, విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకపంఐ ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. శుక్రవారం రాత్రి ఈ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేసి మూవీపై ప్రకటన ఇచ్చారు.