Home / PM Modi
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
18వ లోక్సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.
ఇటలీలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్లతో సమావేశమయ్యారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్పై సంతకం చేశారు.
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్తో కలిసి ఢిల్లీ వెళ్లారు.ఈ సందర్బంగా ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా కన్యాకుమారి వెళ్లారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్లో రెండు రోజుల పాటు ఆయన ధ్యానం చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.