Home / PM Modi
Namo Bharat train : దేశంలో 16 బోగీలతో మొదటి నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిహార్లోని జయ్నగర్-పట్నా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడువనున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రైల్లో 12 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్ల […]
Unesco honour : మన భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటుదక్కింది. విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు. 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు.. భారతీయ జ్ఞాన […]
Prime Minister Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖారారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పనులను మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పనుల పున:ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. మోదీ ప్రధాని పర్యటన […]
PM Modi Serious on Congress party regarding Waqf Act: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేసిందన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో […]
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎటువంటి పదవీ కాంక్ష లేకుండా సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా ముందుకుసాగుతోందని చెప్పారు. ఎన్డీయే కూటమి నేతలంగా ప్రతిఒక్క పౌరుడి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు […]
Pamban Bridge : భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద భాగాన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని […]
PM Modi To Inaugurate India’s First Vertical Lift Sea Bridge: తమిళనాడులోని రామేశ్వరంలో కేంద్ర ప్రభుత్వం పంబన్ బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ విధానంలో బ్రిడ్జి మధ్యలో భారీ షిప్లు వెళ్లేలా స్టెయిన్ లెస్ స్టీల్తో అద్భుతంగా నిర్మించింది. ఈ పంబన్ బ్రిడ్జిని కేంద్రం రూ.550కోట్లతో దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించింది. ఈ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 నిమిషాలకు […]
PM Modi SriLanka Visit : మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వద్ద ప్రస్తావించారు. తమిళ జాలర్లను తక్షణమే విడుదల చేసి, వారి పడవలను విడిచిపెట్టాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం పెండింగ్లో ఉంది. సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. […]
PM Modi meets Bangladesh Chief Adviser Yunus: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ హమ్మద్ యునుస్లు మొట్టమొదటిసారి శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకాక్లోని షాంగ్రిలా హోటల్లో కలుసుకున్నారు. ఇరువురు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే అధికారికంగా ఇరువురి మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం తెలియారాలేదు. కానీ విశ్వసనీయవర్గాల సమాచారం యునుస్ షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమండ్ చేస్తే.. మోదీ బంగ్లాదేశ్లో మైనార్టీలపై […]
PM Modi : సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్ ప్రజలపై గతవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. 4,521 మంది గాయపడ్డారు. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఈ క్రమంలో మయన్మార్ను ఆదుకొనేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ […]