Last Updated:

IND vs ENG: ఇండియా బ్యాటింగ్.. పంత్‌కే కీపింగ్ బాధ్యతలు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండ‌వ సెమీస్‌లో భాగంగా నేడు భారత్ ఇంగ్లండ్ తో తలపడుతుంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫ‌స్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

IND vs ENG: ఇండియా బ్యాటింగ్.. పంత్‌కే కీపింగ్ బాధ్యతలు

IND vs ENG: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండ‌వ సెమీస్‌లో భాగంగా నేడు భారత్ ఇంగ్లండ్ తో తలపడుతుంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫ‌స్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అడిలైడ్‌లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా ఆడ‌నున్న‌ది. తనకు గాయంతో ఎటువంటి స‌మస్య లేద‌ని జ‌ట్టులో ఎటువంటి మార్పు చేయ‌డం లేద‌ని రోహిత్ తెలిపాడు. జింబాబ్వేతో ఆడిన జ‌ట్టుతోనే ఈ మ్యాచ్ ఆడుతున్న‌ట్లు వెల్లడించారు. దీనితో ఈ మ్యాచ్ లో కీపింగ్ బాధ్య‌త‌ల్ని పంత్ చేప‌ట్ట‌నున్నాడు.

అడిలైడ్‌ వేదికగా ఇప్ప‌టి వ‌ర‌కు 11 టీ20 మ్యాచ్‌లు జ‌రిగాయి. అయితే ఇక్క‌డ టాస్ గెలిచిన ఏ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాచ్‌ను గెలిచిన దాఖలాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఇంగ్లండ్ జ‌ట్టులో డేవిడ్ మల‌న్‌, మార్క్ వుడ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌, క్రిస్ జోర్డాన్‌లు బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుతో పాకిస్థాన్ జట్టు టోర్నీ కప్ కోసం తలపడనుంది.

ఇదీ చదవండి: ఐసీసీ T20 ర్యాంకింగ్స్.. టాప్ టెన్ లో కోహ్లికి దక్కని స్దానం

ఇవి కూడా చదవండి: