Last Updated:

Seema Haider: ’ప్రీతి‘ పేరుతో భారత్ లోకి ప్రవేశించిన సీమా హైదర్..

పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్‌లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు 'ప్రీతి'గా చెప్పినట్లు బయటపడింది.

Seema Haider:  ’ప్రీతి‘ పేరుతో భారత్ లోకి ప్రవేశించిన సీమా హైదర్..

 Seema Haider: పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్‌లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు ‘ప్రీతి’గా చెప్పినట్లు బయటపడింది. ఐడీ కార్డ్ చూపించమని అడిగినప్పుడు సీమా తాను భారతీయురాలినని, ఆధార్ కార్డు ఉందని నమ్మకంగా చెప్పిందని బస్ సర్వీస్ మేనేజర్ గు తెలిపారు.

సీమా హైదర్ నాలుగు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని సృష్టి బస్ సర్వీస్ మేనేజర్ ప్రసన్న గౌతమ్ తెలిపారు. టిక్కెట్ల కోసం చెల్లించడానికి ఆమెకు నేపాల్ కరెన్సీ తక్కువగా ఉంది.దీనితో యూపీఐ ద్వారా బ్యాలెన్స్ మొత్తాన్ని బదిలీ చేయడానికి ఆమె భారతదేశంలోని స్నేహితుడికి బహుశా సచిన్‌కి కాల్ చేసిందని గౌతమ్ పేర్కొన్నారు. అతను మిగిలిన 6,000 నేపాల్ రూపాయిలను (భారత కరెన్సీలో సుమారు రూ. 3,750) యూపీఐ ద్వారా చెల్లించాడు. యూపీఐ చెల్లింపు గురించి తన భారతీయ స్నేహితుడితో మాట్లాడేందుకు సీమా హైదర్ తన కార్యాలయంలోని Wi-Fiని ఉపయోగించారని ప్రసన్న గౌతమ్ పేర్కొన్నారు.

నకిలీ గుర్తింపుతో ఖాట్మండు హోటల్లో బస..( Seema Haider)

సీమా హైదర్ మరియు ఆమె ప్రేమికుడు సచిన్ మీనా మార్చిలో ఖాట్మండులోని ఒక హోటల్‌లో తమ నకిలీ గుర్తింపుతో బస చేసారు.హోటల్ రిసెప్షనిస్ట్ ఈ జంట ఎటువంటి ఐడీ కార్డులను ఇవ్వలేదని మరియు రిజిస్టర్‌లో వారి పేర్లను మాత్రమే నమోదు చేశారని చెప్పారు. అయితే రిజిస్టర్‌ను పరిశీలించగా వారి పేర్లు కనిపించలేదు.రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ, సీమా తాను పాకిస్తాన్‌కు చెందినవారని వెల్లడించలేదని, గదిని బుక్ చేసేటప్పుడు జంట నకిలీ పేర్లను ఉపయోగించుకునే అవకాశం ఉందని అన్నారు.

దర్యాప్తు దశలో సీమా హైదర్ కేసు..

సీమా హైదర్ పాకిస్తాన్ సైన్యం మరియు ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో ఆమెకు గల సంబంధాలపై ATS మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆరా తీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఆమెను, సచిన్ మరియు అతని తండ్రిని నోయిడాలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో జూలై 17 న సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించింది.ఆమె పాకిస్థాన్ గుర్తింపు కార్డు ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా పుట్టినప్పుడు పొందే ఐడీ కార్డ్ సెప్టెంబర్ 20, 2022న జారీ చేయబడింది.ఆమె పాకిస్థాన్ పౌరసత్వ ఐడీ కార్డు పొందడంలో జాప్యంపై ఉత్తరప్రదేశ్ ATS దర్యాప్తు చేస్తోంది. వీసా లేకుండానే ఆమె భారత్‌లోకి ప్రవేశించడంపై కూడా సోదాలు జరుగుతున్నాయి.