Amrit Bharat Railway Stations: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్కు అడుగులు.. ఏ దిక్కున వెళ్లినా అభివృద్ధి ఫలాలు

PM Modi inaugurates 103 redeveloped railway stations under Amrit Bharat Scheme: రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ మేరకు బికనీర్లోని కర్ణిమాత ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘అమృత్ భారత్’ స్టేషన్ల ప్రారంభోత్సవంలో భాగంగా బికనీర్లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు వర్చ్వల్ విధానంలో దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని బేగంపేటతో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను వర్చ్వల్ విధానంలో ప్రారంభించారు. అలాగే ఏపీలోని సూళ్లూరుపేట అమృత్ భారత్ స్టేషన్ ను కూడా ప్రారంభించారు.
కర్ణిమాత ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి వచ్చానని, కర్ణిమాత ఆశీర్వాదంతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ప్రధాని మోదీ అన్నారు. రూ.26వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. భారత్లో ఏ దిక్కున వెళ్లినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయన్నారు.
దేశంలో 70 మార్గాల్లో వందేభారత్ ట్రైన్లు నడుస్తున్నాయని తెలిపారు. సుమారు 30 వేల కిలోమీటర్లకు పైగా కొత్త రైలు మార్గాలు వేయించామని వివరించారు. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ కోసం అడుగులు పడుతున్నాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.