Jyoti Malhotra: పాకిస్తాన్ ఏజెంట్ ను పెళ్లిచేసుకోమన్న జ్యోతి మల్హోత్ర!

Jyoti Malhotra: పుట్టిన దేశానికి ద్రోహం చేసేవాళ్లు ఉగ్రవాదులకన్నా నీచమైనవాళ్లు. వీళ్ల ద్రోహం యావత్ దేశ ప్రజలపై ప్రభావం పడుతుంది. వీళ్లు ఇచ్చే ఇన్ఫర్ మేషన్ తో ఉగ్రవాదులు బంబులను పెడితే అందులో అమాయక పౌరులు ప్రాణాలు విడుస్తారు.
ఇలాంటి దేశద్రోహులు శత్రుదేశంతో చేతులు కలిపి భారత రహస్యాలను, మిలటరీ మూమెంట్స్ ను శత్రుదేశాలకు అందించడంతో, సాదారణప్రజలు సంచరించే చోటును అక్కడి పరిస్థితులను తీవ్రవాదులు అంచనావేసినప్పుడు పహల్గాం లాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్నప్పటినుంచి విలువలు, వ్యక్తిత్వం లేని వాళ్లే ఇలాంటి చర్యలకు పూనుకుంటారు. విలువలతో పెరిగిన వారు కనీ, పెంచిన కుటంబానికి, పెరిగిన దేశానికి, మానవాళికి విధేయతగా ఉంటారు. అలాంటివేవీ లేదంటే వాళ్లు పెరిగిన విధానంలోనే తప్పు ఉందని అర్థం.
హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా శత్రుదేశమైన పాకిస్తాన్ తో చేతులు కలిపి భారత సైనిక మూమెంట్ ను, పర్యాటక ప్రదేశాలలో పరిస్థితులను పాకిస్తాన్ ఐఎస్ఐ కు చేరవేసింది. పాకిస్తాన్ ఆర్మీకి అక్కడి తీవ్రవాదులకు పెద్ద తేడా లేదు. వేరే దేశాలను ముఖ్యంగా భారత్ ను ఇస్లాం రాజ్యాన్ని చేసే క్రమంలో ఆర్మీ, తీవ్రవాదులు కలిసే పనిచేస్తున్నారు. ఒక రకంగా తీవ్రవాదుల పిల్లలు ఆర్మీలో పనిచేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ ఆర్మీ తరపున మాట్లాడిన అధికారి (Spokes Person) ఓక టెర్రరిస్ట్ కుమారుడు. అతని పేరు అహ్మద్ షరీఫ్ చౌధరీ. ఇతని తండ్రి ఉద్యోగ రిత్యా పాక్ అణు శాస్త్రవేత్వ , ఆపై ఒసామా బిన్ లాడెన్ కు సన్నిహితుడు. ఉగ్రవాదిగా ముద్రపడినవాడు.
పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI (ఇంటర్ సర్వీస్ ఇంటలీజెన్స్) లో పనిచేసే హసన్ తో జ్యోతీ మల్హోత్రా సన్నిహిత సంబందాలు పెట్టుకుంది. అది ఏకంగా తనను పాకిస్తాన్ లో పెళ్లిచేసుకోవాలని ఆరాటపడేటంతగా పెరిగింది. ఈ విషయాలన్నింటిని ఆధారాలతో సహా బయట బయటపడ్డాయి. హసన్ , జ్యోతీలు నిరంతరంగా టచ్ లో ఉన్నారు. ఈవిడ పాకిస్తాన్ కు వెళ్లినప్పుడు హసన్ అన్ని ఏర్పాట్లు చేసేవాడు. జ్యోతీ చేసే విషయాలు ఆమె తల్లిదండ్రులకు తెలియదని అధికారులు చెబుతున్నారు. పైగా జ్యోతి కేవలం వీడియోలు మాత్రమే తీస్తుందని అమాయకంగ ఆమె తండ్రి సమాదానం చెబుతున్నాడు. జ్యోతి తల్లిదండ్రులను మీడియా పలకరించినప్పుడు ఆమె తండ్రి మామూలుగా, లోకజ్ఞానం లేనివ్యక్తిగా ఉన్నాడు. అంటే జ్యోతి తన తండ్రినే మాయచేసి తెరవెనకాల శత్రుదేశమైన పాకిస్తాన్ గూఢచర్య సంస్థతోనే లింకు పెట్టుకుంది.
జ్యోతికి నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. అందులో ఒకదానికి దుబాయ్ నుంచి భారీ మొత్తం క్రెడిట్ అయ్యేవని అధికారులు తెలిపారు. జ్యోతి పహల్గాం దాడికి కొన్ని రోజుల ముందు అక్కడే ఉండి వీడియోలు తీసింది. అంటే సదరు లొకేషన్స్ ను పాక్ ఐఎస్ఐకి పంపినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదుల పేరు చెప్పుకుని పహల్గాం దాడి చేసిన వారిలో పాక్ ఆర్మీకి చెందిన కమాండోలు ఉన్నారు. పహల్గాం దాడి జరిగినప్పుడు జ్యోతి అక్కడే ఉన్నట్లు సమాచారం.
రెండు సార్లు పాకిస్తాన్ కు వెళ్లిన జ్యోతి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేసే రహీమ్ అనే అధికారితో పరిచయం పెంచుకుంది. ఆతర్వాత అతను ఐఎస్ఐ హ్యాండ్లర్ హసన్ ను పరిచయం చేశాడు, దీంతో అతను చెప్పినట్లు భారత విషయాలను చేరవేసింది. ఆపై తనను పాకిస్తాన్ పెళ్లిచేసుకోవాలని కోరేదాకా వెళ్లింది జ్యోతి.
పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నారని పదిమందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో ఒక విధ్యార్థి, వ్యాపారి, సెక్యురిటీ గార్డు ఉన్నారు. వీరు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు.