Sharmishta Panoli : న్యాయ విద్యార్థిని విడుదల చేయండి : ప్రధాని మోదీకి డచ్ ఎంపీ విజ్ఞప్తి

Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని దుయ్యబట్టారు. విద్యార్థిని శిక్షించొద్దని కోరారు. ధైర్యవంతురాలు శర్మిష్ఠను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విద్యార్థినిపై ఉందని పేర్కొంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ నటులు స్పందించలేదని ఉద్దేశిస్తూ ఆమె సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ వీడియో పోస్టు చేసింది. వీడియోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థినిపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. విద్యార్థిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.