Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి మరియు మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి మరియు మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. విచారణ ప్రారంభించనివ్వండి. మరియు 3 నెలల తర్వాత తాజా దరఖాస్తును దాఖలు చేయవచ్చు… నగదు బదిలీకి సంబంధించి ఒక అంశం, రూ. 338 కోట్లు, తాత్కాలికంగా నిర్ధారించబడిందని అని ధర్మాసనం పేర్కొంది.
ఫిబ్రవరి 26న అరెస్టయిన మనీశ్ సిసోడియా..(Manish Sisodia)
ఫిబ్రవరి 26న, సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన కస్టడీలో ఉన్నారు. మార్చి 9న తీహార్ జైలులో సిసోడియాను విచారించిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నుండి వచ్చిన మనీలాండరింగ్ కేసులో సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది.సీబీఐ మరియు ఈడీ ప్రకారం, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని సవరించేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. లైసెన్స్ హోల్డర్లకు అనవసరమైన సహాయాలు అందించబడ్డాయి.ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2021న ఎక్సైజ్ పాలసీని అమలు చేసింది. అయితే అవినీతి ఆరోపణల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ లో దానిని రద్దు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు మనోజ్ తివారీ స్పందిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ ముఠా మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని స్పష్టమవుతోందని అన్నారు. ఆప్లోని అగ్రనేతలను త్వరలో అరెస్టు చేయడం ఖాయం. అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టవుతారని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో 14 కి చేరిన మృతుల సంఖ్య.. మృతులు పెరిగే ఛాన్స్ !
- Vizianagaram Train Accident : విజయనగరం జిల్లా ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్, పీఎం మోదీ, ప్రముఖులు.. నష్ట పరిహారం ప్రకటన