Published On:

Operation Sindoor: సైనికా అందుకో ఈ సామాన్యుడి సెల్యూట్

Operation Sindoor: సైనికా అందుకో ఈ సామాన్యుడి సెల్యూట్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై ప్రతి భారతీయుడు గర్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మన దేశసేన చేసిన సాహసానికి, త్యాగానికి సలాం కొడుతున్నాడు. భారత్ పాక్ వార్ లో గర్వించదగ్గ విజయం సాధించడానికి మన దేశ ఆర్మీయే కారణమని పౌరులు అంటున్నారు. ఇక దేశసరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లడఖ్ లో పర్యాటకులు మంచు మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. దేశభద్రత వ్యవస్థ ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. భూమి నుంచి 18 వేల అడుగులపైన ఉన్న లడఖ్ లోని కార్తుంగ లేహ్ దగ్గర సైన్యం పహారా కాస్తుంది.

 

పహెల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కు వరుస దెబ్బలు తగిలాయి.ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిదైంది. చైనా, టర్కీ మద్దతు ఇచ్చినా, అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు.అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యల్ ఉన్న ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ను దూరం అయ్యాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాకిస్తాన్ కు దిక్కుతోచడం లేదు. అయితే ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే పాకిస్తాన్ మద్దతుతో సీమాంతర ఉగ్రవాదం కొనసాగుతున్నంతసేపు ఈ నిలిపివేత కొనసాగుతుందని భారత్ క్లారిటీ ఇచ్చింది.

 

భారత్ తో ద్వేషం, పాకిస్తాన్ కు ఎప్పుడూ నష్టమే చేస్తోంది. 1970ల్లో జరిగిన యుద్దం తరువాత తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ పేరుతో ప్రపంచపటంపై మరో ప్రత్యేక దేశం ఆవిర్భవించింది. ఇటీవల భారత్ ,పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. బలూచ్ తిరుగుబాటుదారులు విజృంభించారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయింది. బలూచిస్తాన్ పేరుతో మరో కొత్తదేశం ఆవిర్బవించింది.

 

ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ట్రైలర్‌ మాత్రమే చూశారని తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తామని పాక్‌ను హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌ బేస్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఎయిర్‌ వారియర్స్‌తో భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పహల్గాం దాడి ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా చూసిందన్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశామన్నారు. బ్రహ్మోస్‌ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించామని తెలిపారు. బోర్డర్‌ దాటకుండానే పాక్‌ ఉగ్ర శిబిరాలను నాశనం చేశామని రాజ్‌ నాథ్ సింగ్‌ వెల్లడించారు.