Rangareddy: చికెన్ బిర్యానీలో బల్లి.. ఫ్రైఅయింది తినమన్న ఓనర్

Rangareddy: రెస్టారెంట్లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులోని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్కు గుజ్జా కృష్ణరెడ్డి అనే వ్యక్తి మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినడం మొదలుపెట్టారు.
బిర్యానీలో బల్లి కనిపించడంతో కృష్ణరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం రెస్టారెంట్ యజమాని నిలదీయగా.. మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు 100 డయల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ లలో ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేస్తున్నారు. గల్లీకి ఒక రెస్టరెంట్ అయినప్పటినుంచి భారీగా నాన్ వెజ్ తీసుకువచ్చి స్టోర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ లలో నింపి డీఫ్రిజ్ లలో స్టోర్ చేస్తున్నారు. అది ఒక్కోసారి కుల్లిపోయే స్టేజ్ కు కూడా వస్తున్నాయి. మరికొన్ని రెస్టారెంట్లలో బల్లులు వస్తున్నాయని భోజన ప్రియులు వాపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా రెస్టారెంట్ ఓనర్లు మాత్రం మారడం లేదు.

lizard found in chicken biryani at ibrahimpatnam rangareddy