Chandola demolition: అహ్మదాబాద్ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్.. బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాల కూల్చివేత

Chandola Demolition Phase 2: అహ్మదాబాద్ చరిత్రలోనే బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. చందోలాలో అక్రమంగా చేపట్టిన బంగ్లాదేశీయుల నిర్మాణాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఈ మేరకు భారీ ఎత్తున జేసీబీలు, పోలీసు బలగాలతో రెండో దశ ఆపరేషన్ చేపట్టింది. డోలా సరస్సు లోని 100 ఎకరాల స్థలంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తుండడంతో అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియ చేపట్టింది. శాంతి భద్రతల సమస్య రాకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, చందోలా సరస్సు ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపు తెల్లవారుజామునే ప్రారంభమైంది. ఈ మేరకు అక్రమ కూల్చివేతలతో పాటు శిథిలాలను సైతం తొలగిస్తుంది. ఒకే రోజు దాదాపు 8,500 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ మేరకు 20ఏళ్లుగా అక్రమణలకు గురైన 2.5లక్షల చ.మీ భూమిని స్వాధీనం చేసుకుంది.
కాగా, అంతకుముందు ఏప్రిల్ 20 నుంచి మే1 మధ్య తొలి దశ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా 1.5 లక్షల చ.మీ భూమిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసందే. అయితే, రెండోదళ ఆపరేషన్లో భాగంగా ఇవాళ మొత్తం 50 బృందాలు ఉదయం 7 నుంచే కూల్చివేతలు ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో 50 బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు కూల్చివేస్తుండగా.. 3వేల మంది పోలీసులు భద్రత కల్పించారు.