Published On:

Accident in New York: న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు దుర్మరణం

Accident in New York: న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు దుర్మరణం

2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్‌లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపింది.

 

వివరాల ప్రకారం.. భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అమెరికా కాలమానం ప్రకారం.. సౌరవ్ ప్రభాకర్(23), మానవ్ పటేల్(20), మరో మిత్రుడు రెండు రోజుల క్రితం కారులో ప్రయాణమయ్యారు. అయితే ఆ కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ
అక్కడికక్కడే చనిపోగా. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

 

కాగా, ఒహాయోలోని క్లీవ్ ల్యాండ్ స్టేట్ యూనివర్సటీలో సౌరవ్ ప్రభాకర్(23), మానవ్ పటేల్(20)లు ఉన్నత విద్య చదువుతున్నారు. మే 10న వీరు కారులో వెళ్లగా.. పెన్సిల్వేనియాలోని లాంకస్టరన్ కౌంటీ సమీపంలో కారు కంట్రోల్ తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులకు భారత కాన్సులేట్ సంతాపం ప్రకటించింది. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పింది. ఇద్దరు మృతదేహాలను భారత్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.