Home / తప్పక చదవాలి
సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
విశాఖలో లోక్నాయక్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జస్టిస్ ఎ.వి.శేషసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్, హరివంశరాయ్బచ్చన్ వర్థంతి సందర్భంగా పురస్కారాల ప్రదానం చేశారు. ఈ ఏడాది యండమూరి వీరేంద్రనాథ్కు లోక్నాయక్ సాహిత్య పురస్కారం ఇచ్చారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ పర్యటనలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనవరి 22న అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు తిరుచిరాపల్లి లోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ప్రధాని మేత తినిపించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్ ) పోర్టల్ కర్ణాటకలో కేవలం 11 నెలల్లో 28,657 మంది మైనర్ బాలికలు గర్బం దాల్చారని పేర్కొంది. వీరిలో 558 మంది గర్భిణీ బాలికలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సగటున 2,600 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సూడాన్ లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ), మిత్రరాజ్యాల అరబ్ మిలీషియా మధ్య జాతి హింసలో గత సంవత్సరం సూడాన్లోని వెస్ట్ డార్ఫర్ ప్రాంతంలోని ఒక నగరంలో 10,000 నుండి 15,000 మంది వరకు మరణించారు.
మయన్మార్లోని తిరుగుబాటు దళాలు మరియు జుంటాల మధ్య కొనసాగుతున్న పోరుతో గత కొన్ని రోజులుగా వందలాది మంది ఆర్మీ సిబ్బంది భారత సరిహద్దును దాటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోకి ప్రవేశించారు. ఈ వలసలను చూసిన మిజోరం ప్రభుత్వం మయన్మార్ సైనికులను త్వరగా పొరుగు దేశానికి తిరిగి పంపాలని కేంద్రాన్ని కోరింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో 100 మీటర్ల లోతులో బొంద పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించినట్లు అధికారిక మీడియా శనివారం నివేదించింది.హెనాన్లోని యన్షాన్పు గ్రామంలోని యింగ్కాయ్ పాఠశాలలో మంటలు వ్యాపించాయని శుక్రవారం రాత్రి 11 గంటలకు స్థానిక అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించినట్లు పీపుల్స్ డైలీ నివేదించింది.