Last Updated:

China: చైనాలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి..

సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్‌క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.

China: చైనాలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి..

 China: సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్‌క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.

వర్షాలు.. నిర్మాణపనులు..( China)

కొండచరియలు విరిగిపడటానికి గల కారణం వెంటనే తెలియరాలేదు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గత వారం వాయువ్య చైనాలోని ఒక మారుమూల స్కీయింగ్ ప్రాంతం నుండి పర్యాటకులను ఖాళీ చేయించారు, అక్కడ భారీ మంచు కారణంగా హిమపాతాలు సంభవించడంతో ఒక వారం పాటు 1,000 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. హిమపాతాల ప్రభావంతో రహదారులు మూసుకుపోవడంతో మంగోలియా, రష్యా మరియు కజకిస్తాన్‌లతో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న జిన్‌జియాంగ్ ప్రాంతంలోని అల్టే ప్రిఫెక్చర్‌లోని ఒక గ్రామంలో పర్యాటకులు మరియు నివాసితులు చిక్కుకుపోయారు.తరచుగా వర్షం లేదా అసురక్షిత నిర్మాణ పనుల వల్ల సంభవించే కొండచరియలు చైనాలో సాధారణంగా మారాయి. గత ఏడాది కొండచరియలు విరిగిపడటంతో కనీసం 70 మంది చనిపోయారు, 2021లో నిర్మాణంలో ఉన్న సొరంగంలో వరదలు రావడంతో 14 మంది కార్మికులు చనిపోయారు.

గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్స్‌ల మధ్య మారుమూల ప్రాంతంలో వాయువ్య దిశలో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన ఒక నెల తర్వాత యునాన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిసెంబర్ 18న సంభవించిన 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 149 మంది చనిపోగా పలు ఇళ్లు శిధిలమయ్యాయి.