Home / తప్పక చదవాలి
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా నుండి విడిపోయాడనే పుకార్ల నేపధ్యంలో నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో సనాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.
: ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ను పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఆయన పేర్కొన్నారు
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.
డాగ్ఫ్లేషన్ అనేది పెంపుడు జంతువులకు ఆహారం,సంరక్షణ లకు పెరుగుతున్న ధరల కొలమానంగా ఉద్భవించింది. బ్రిటన్లో పెంపుడు జంతువును చూసుకునే ఖర్చు రెండు రెట్లు పెరిగింది. దీనితో దేశంలోని కుక్కల పునరావాస స్వచ్ఛంద సంస్థలు గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ని ఎదుర్కొంటున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ లో శీతల తుఫాన్లకు 10 రాష్ట్రాలలో 55 మంది మృతి చెందారు. అతి శీతలమైన గాలి, వరుస తుఫానుల కారణంగా దేశమంతటా విస్తృతంగామంచు కురుస్తున్న కారణంగా మరణాలు సంభవించాయి. టేనస్సీ రాష్ట్రంలో ఈ వారం 14 మరణాలు ఈ రకంగా సంభవించాయి.
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
దుబాయ్లోని అల్ నహ్యాన్ రాజ కుటుంబం రూ.4వేలకోట్ల భవనం , ఎనిమిది ప్రైవేట్ జెట్లు, ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నకుటుంబమని తాజాగా ఒక నివేదిక పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో చర్చించారు.
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సెక్రటరీల కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, మాదిగలు వంటి షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర సమూహాల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకోగల పరిపాలనా చర్యలను పరిశీలించడానికి క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలు, ఆరు మోర్చాలకు అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన మోర్చా,జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.