Home / తప్పక చదవాలి
కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
గుజరాత్లోని వడోదర హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఘటన జరిగినప్పుడు పడవలో 23 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుండి ఐదుగురు పిల్లలను రక్షించింది.
ఉత్తర ఇటలీ ప్రావిన్స్ అన్ని కుక్కలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది, వీధుల్లో పెంపుడు కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడంలో విఫలమైతే వాటి యజమానులను కనుగొని జరిమానా విధించే ప్రయత్నంలో ఉంది.కుక్క డీఎన్ఏ సేకరించిన తర్వాత, పరీక్ష ఫలితాలు డేటాబేస్లో చేర్చబడతాయి. ఇది కుక్క యజమానులను ట్రేస్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఆఫ్రికా దేశం జాంబియాలో కలరాతో వణికిపోతోంది. దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా కలరా బారిన పడగా 400 మందికి పైగా మరణించానే. దీనితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసింది. రాజధాని లుసాకాలోని ఫుట్బాల్ స్టేడియంను చికిత్సా కేంద్రంగా మార్చింది.
అయోధ్యలోని రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్టాన్ (దీక్ష) పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నేలపై నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్పై పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి స్టేట్ టీవీలో తెలిపారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వ్యక్తులు ఇరాన్ పౌరులు కాదని మర్హమతి చెప్పారు.
లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అయోధ్యలోని శ్రీరామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడికి అంకితం చేసిన స్టాంపుల పుస్తకాన్ని విడుదల చేశారు. రామ మందిరం.గణేషుడు,హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్ , శబరి లతో కూడిన ఆరు స్టాంపులను విడుదల చేసారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు.బుధవారం జనసేన పార్టీ 50 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది ఆయన తన లేఖ ద్వారా తెలియేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను హరిరామ జోగయ్య విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ప్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు.