Home / తప్పక చదవాలి
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం నాడు గాజా స్ట్రిప్లో తమ సైనికులలో 21 మంది మరణించినట్లు ప్రకటించింది, ఇది హమాస్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నేడు వైసీపీకి రాజీనిమా చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా వల్ల అనిశ్చితి రాలేదు.. ఇందుకు తాను బాధ్యుడుని కాదని ఆయన అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.
తేజ సజ్జా- ప్రశాంత్ వర్మల కాంబినేషన్లో సంక్రాంతికి విడుదలయిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెకన్లలో దూసుకుపోతోంది. కేవలం విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదవ స్దానంలో నిలిచింది.
తూర్పు ఉక్రెయిన్లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
శతాబ్దాల ఓర్పు, లెక్కేలేనన్ని త్యాగాలు, తపస్పు తరువాత మన శ్రీరాముడు వచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం భారత సమాజంలో సహనం, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా వర్ణించారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.