Home / తప్పక చదవాలి
చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు. కుక్కలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. షాంఘైకి చెందిన సియు కొన్ని సంవత్సరాల క్రితం వీలునామా తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తిని ఇస్తూ వీలునామా రాసింది.అయితే తాజాగా ఆమె మనసు మార్చుకుంది. సియు అనారోగ్యం పాలైనప్పుడు పిల్లలు ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఆమె వీలునామాను సవరించింది
వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ, ఆ దేవుడే సాక్ష్యమని చెప్పారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్దాయి విస్తృత స్దాయి సమావేశంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్పీఎస్సీ ) ఛైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళి సై ఆమోదించారు. టీఎస్ పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ యాదయ్య, వై.రామ్మోహన్ రావులను ప్రభుత్వం నియమించింది.
: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లోని జిన్యు నగరంలో బుధవారం మధ్యాహ్నం భవనంలో మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. జిన్యులోని యుషుయ్ జిల్లాలో వీధి దుకాణంలో మంటలు చెలరేగాయని స్థానిక ఫైర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ప్రధాన కార్యాలయం తెలిపింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బుధవారం నాడు తేల్చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక జాతీయ అంశాల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచిద్దామని అన్నారు. దీనితో కాంగ్రెస్కు దీదీకి మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
మాలిలోని బంగారుగనిలో సొరంగం కూలి 70 మందికి పైగా మరణించారని స్థానిక స్థానిక అధికారి బుధవారం తెలిపారు. గత వారం జరిగిన ఈ ప్రమాదసమయంలో 200 మందికి పైగా కార్మికులు ఉన్నారని చెప్పారు. 73 మృతదేహాలను కనుగొన్నామంటూ బంగారు గనుల అధికారి ఓమర్ సిడిబే తెలిపారు.