Home / తప్పక చదవాలి
బీహార్లో మహాఘట్బంధన్ అధ్యాయం ఇక ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు.తన రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బీజేపీతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం నితీష్ బీజేపీని వీడి ఆర్జెడీ - కాంగ్రెస్తో జట్టు కట్టి మహాఘట్బంధన్గా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం జెడ్+ సెక్యూరిటీ మంజూరు చేసింది.అధికార సీపీఐ(ఎం) పార్టీ విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నల్ల జెండా ప్రదర్శనపై గవర్నర్ రోడ్డు పక్కన కూర్చోని నిరసనకు దిగిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నించిందని, పార్టీ మారేందుకు వారికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిన బీజేపి ఆప్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిందని ఆయన పేర్కొన్నారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొoడి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే.. సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజక వర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని సీఎం జగన్ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాసారు.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గత మూడువారాల్లో 200 మందికి పైగా పిల్లలు న్యుమోనియా తో మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పంజాబ్ కేర్టేకర్ ప్రభుత్వం మరణించిన పిల్లలలో చాలా మంది న్యుమోనియాకు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.