Home / తప్పక చదవాలి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్లో హమాస్పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం సర్వే నివేదికను చదివి వినిపించారు. .
రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
లుగువారి ఆరాధ్య నటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్... దశాబ్దాలుగా సామాజికసేవలో తరిస్తున్న రియల్ హీరో.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది . పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు... అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్తో సత్కరించింది.
సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.కేసీఆర్ తో పాటు అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ను కోర్టు ఆదేశించింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు చెందిన జనతాదళ్ (యు)కు లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు మధ్య బేధాభిప్రాయాలు గురువారం తారాస్తాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి .. రాబోయే లోకసభలో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల గ్రౌండ్ సిస్టమ్లను ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమయింది. సిస్టమ్ యొక్క క్షిపణులు ఈ ఏడాది మార్చి నాటికి ఫిలిప్పీన్స్కు చేరుకుంటాయని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వెల్లడించారు.