Last Updated:

Ayodhya: అయోధ్యలో రామమందిరం గర్భగుడికి చేరిన శ్రీరాముడి విగ్రహం

లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు. 

Ayodhya: అయోధ్యలో రామమందిరం గర్భగుడికి చేరిన శ్రీరాముడి విగ్రహం

Ayodhya:లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.  విగ్రహాన్ని ఆలయంలోకి చేర్చేందుకు క్రేన్‌ను ఉపయోగించారు.

విగ్రహాన్ని శుద్ది చేసి..(Ayodhya)

ఈ రోజు గణేశంబికా పూజ, ఆయుష్మంత్ర పఠనంతో సహా మంత్రాల పఠనం, మండప ప్రవేశ ఆచారాల తరువాత విగ్రహాన్ని సింహాసనంపై ఉంచడం జరుగుతుంది. నీటితో విగ్రహాన్ని శుద్ధి చేస్తారు.తరువాత పాలు, నెయ్యి, ఆవు పేడ, గోమూత్రం, పెరుగుతో శుద్ది చేస్తారు. సాయంత్రం హారతి ఇస్తారు. తరువాత మండపం యొక్క వాస్తు పూజ నిర్వహించి యాగం ప్రారంభిస్తారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 16న ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు జనవరి 22న ప్రాణప్రతిష్టతో ముగుస్తాయి.ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా 400 మంది సాధువులు హాజరవుతున్నారు. పలువురు ప్రముఖులకు ఈ వేడుకకు సంబంధించి ఆహ్వానాలు అందాయి.

అయోధ్య వెబ్ అప్ డేట్స్ ..

ఇలాఉండగా భారత వాతావరణ శాఖ అయోధ్య వెబ్ అప్ డేట్స్ కోసం వెబ్‌పేజీని ఆవిష్కరించింది. వెబ్‌పేజీ అయోధ్య, సమీపంలోని ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌లపై వెబ్ అప్ డేట్స్ అందిస్తుంది. అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నో మరియు న్యూఢిల్లీ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సమాచారం వెబ్‌పేజీలో అందుబాటులో ఉంది. వెబ్‌పేజీ ఉష్ణోగ్రత, అవపాతం, తేమ మరియు గాలి నమూనాలతో సహా అన్ని వాతావరణ పారామితులపై సమాచారాన్ని కలిగి ఉంటుంది.ఈ సమాచారం హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్ మరియు స్పానిష్ వంటి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే ప్రధాన భాషలలో అందుబాటులో ఉంటుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలను కలిగి ఉన్న వాతావరణ బులెటిన్ కూడా వినియోగదారులకు హిందీ,ఇంగ్లీష్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా జనవరి 22న భారతదేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు మరియు కేంద్ర పారిశ్రామిక సంస్థలు ఒక పూట మాత్రమే పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.