Published On:

Road Accident: పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి!

Road Accident: పెట్రోలింగ్ వాహనం ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి!

Constable dies in Road Accident: పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీసు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగింది. శనివారం అర్ధరాత్రి షాపూర్ హైవేపై ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు మార్గంలో వెళ్లున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనం వద్ద ఉన్న విజయ్ కుమార్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

 

మరో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. తోటి పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన విజయ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: