Published On:

Bhu Barathi in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి.. ప్రజల వద్దకే అధికారులు

Bhu Barathi in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి.. ప్రజల వద్దకే అధికారులు

Bhu Bharati Act Implemented from Today Across Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతీ జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు.

 

కాగా, గ్రామాల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి తహసీల్డార్‌తో కూడిన బృందం పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక కొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖను బలోపేతం చేసేందుకు రెండు నెలల్లో 6వేల మంది సర్వేయర్లను నియమిస్తామన్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆయా మండలాల్లో సదస్సులకు శ్రీకారం చుట్టారు. కాగా, అంతకుముందు ఏప్రిల్‌ 14న ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే మొదటి దశలో 4 మండలాల్లో, రెండో దశలో 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సంగతి తెలిసిందే.