New RTI Commissioners: ఆర్టీఐకి కొత్త కమిషనర్లు.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

Telangana govt. Appointments New RTI Commissioners: తెలంగాణలో నలుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మోసిన్ పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాస్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈయన సీనియర్ జర్నలిస్టు. బోరెడ్డి అయోధ్య రెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక పర్వీన్ మోసిన్ ను మైనార్టీ కోటాలో ఎంపిక చేశారు.
మరోవైపు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగావ్ లో జన్మించారు.
కాగా కొంతకాలంగా సమాచార కమిషన్ లో పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పలు ఫిర్యాదుల పరిష్కారం కోసం పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అర్హులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేసింది. పలువురు పేర్లతో జాబితాను రాజ్ భవన్ కు పంపింది. గవర్నర్ ఆమోదంతో ఆర్టీఐ కమిషనర్ల భర్తీని చేపట్టింది.