Home / Telangana Government
Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీలు కుదిరినప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఆ పంథా మార్చుకోనుంది. ఇక మీదట ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మొదటి, మూడో శనివారం కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా పథకాలు, అభివృద్ధిపై మంత్రివర్గం క్రమం తప్పకుండా సమీక్షలు చేయనుంది. […]
Telangana Government: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 6 నుంచి జూన్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు టీచర్లు బాలకార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రీప్రైమరీ స్కూల్స్, నోట్ బుక్స్ పంపిణీ […]
Erragadda Hospital : ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషిత ఆహారం ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగిస్తూ దవాఖాన సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. కలుషిత ఆహారం ఘటనలో ఓ రోగి మృతి చెందగా, 92 మంది అస్వస్థతకు గురయ్యారు. 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. […]
Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అడిగినప్పుడల్లా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ […]
Telangana: రాష్ట్ర ప్రభుత్వం జీపీవో పోస్టుల పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలోనే గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. కాగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3550 […]
Telangana govt. Appointments New RTI Commissioners: తెలంగాణలో నలుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మోసిన్ పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాస్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈయన సీనియర్ జర్నలిస్టు. బోరెడ్డి అయోధ్య రెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక పర్వీన్ మోసిన్ ను మైనార్టీ కోటాలో ఎంపిక చేశారు. మరోవైపు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా […]
TG Government Extended LRS 3 days up to May 3: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్పై కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఇందులో భాగంగానే పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు […]
Telangana Government Increased Heat stroke ex-gratia from Rs 50,000 to Rs.4 lacks: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో కీలక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, భారత వాతావరణ కేంద్రం సైతం ఈ ఏడాది ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వడదెబ్బతో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వనున్నట్లు […]
High Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్సీయూ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ 400 ఎకరాల భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇప్పటికే 400 ఎకరాల భూమలు తమవంటే తమవి అంటూ ప్రభుత్వం, […]
Uttham Kumar Reddy : కాంగ్రెస్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైస్ను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్తో జరిగిన ఒప్పందం మేరకు 8 లక్షల టన్నుల రైస్ను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ తొలివిడతగా 12,500 టన్నుల రైస్ను ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి షిప్పింగ్ చేస్తోంది. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు నేడు కాకినాడ వెళ్లిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. […]