Published On:

GPO: జీపీవో ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే

GPO: జీపీవో ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే

Telangana: రాష్ట్ర ప్రభుత్వం జీపీవో పోస్టుల పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలోనే గ్రామ పాలనాధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు.

 

కాగా ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3550 మంది హాజరయ్యారు. ప్రభుత్వం కేవలం ఐదురోజుల్లోనే అభ్యర్థుల సమాధాన పత్రాలను వ్యాల్యూయేషన్ చేసింది. తుది ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. కాగా ఎంపికైన అభ్యర్థులు, ర్యాంకులను అధికారిక వెబ్ సైట్ http://ccla.telangana.gov.in/welcome.do లింక్ ద్వారా చూసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు 2, 3 రోజుల్లో నియామకపు పత్రాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి జీపీవోలు రావచ్చునని అంచనా.  ఐతే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులకు కేవలం మంది మాత్రమే పరీక్ష రాశారు.

 

జీపీవో పరీక్షల టాపర్లు

1. అద్ద మధు

2. షేర్ లతీఫ్ సాహేబ్

3. బి. ప్రవీణ్ కుమార్

4. విజయ సోమిరెడ్డి

5. ఈదన్న రవీందర్

6. దిడ్డి మౌనిక

7. మణిమాల గ్యాదరీ

8. సూదరి పాల్ ప్రశాంత్ కుమార్

9. మెఘావత్ జగన్

10. పందెన భాస్కర్