Home / తెలంగాణ
అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'ఓకల్ ఫర్ లోకల్' పేరుతో తలపెట్టిన ప్రధానమంత్రి విధానాన్ని పాటించారు
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు
తెలంగాణ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నేతన్నలను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కళా నైపుణ్యానికి వన్నె తెచ్చిన నేతన్నలతోనే గొల్లభామ చీరలకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు
ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీకి పెను ప్రమాదం తప్పింది. సజ్జనార్ ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. దానితో సజ్జనార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
హైదరాబాద్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్కు లింకులు వున్నట్లుగా సమాచారం.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా దసరాను జరుపుకుంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా కనుమరుగవుతుంది.
హైదరాబాదు గాంధీ వైద్యశాల ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన మహాత్మగాంధీ నూతన విగ్రహాన్ని సీఎం కేసిఆర్ అవిష్కరించారు. సమాజాన్ని చీల్చే వ్యక్తుల తీరుతో మహాత్ముని ప్రభ తగ్గదు, మరగుజ్జులు మహాత్ములు కాలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు
ఒకరోజు సెలవు వస్తేనే ఎక్కడికి వెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటాం. అసలే దసరా పండుగ అందులోనూ 15 రోజులు సెలవులు. ఇంక ఆగుతామా చెప్పండి. అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఇంటికని కొందరు, పుట్టింటికని మరికొందరు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీగా దర్శనమిస్తుంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.