Needle Free Blood Testing in Nilofar: నీలోఫర్ ఆసుపత్రిలో AIతో సూదిరహిత రక్త పరీక్షలు.. దేశంలోనే తొలిసారి!

Needle Free Blood tests with AI at Nilofar Hospital: అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు రక్త చేస్తుంటారు. రక్త పరీక్షలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయసు వారు భయపడుతుంటారు. కానీ, ఇప్పుడు భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ దవాఖానలో దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు.. టెక్నాలజీ వినియోగంలో ఒక విప్లవాత్మక ముందడుగుగా చెప్పవచ్చు.
‘అమృత్ స్వాస్థ్ భారత్’ అనే పేరుతో..
‘అమృత్ స్వాస్థ్ భారత్’ అనే పేరుతో టూల్ను క్విక్ విటల్స్ హెల్త్-టెక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారితంగా పనిచేస్తుంది. రోగి శరీరంలో సూది వేయకుండా చర్మంపై సెన్సార్ల సహాయంతో రక్త ప్రవాహంలో మార్పులను గుర్తించగల సామర్థ్యం టూల్కు ఉంది. ప్రక్రియకు ‘ఫోటోప్లెథిస్మోగ్రఫీ’అనే సాంకేతికతను ఆధారంగా తీసుకున్నారు.
ఈ విధానంతో రక్తపోటు, SpO2, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1c, స్ట్రెస్ స్థాయిలు వంటి ఆరోగ్య సంబంధిత కీలక సమాచారాన్ని 20-60 సెకన్లలో అందించగలదు. ఈ పరీక్షతో రోగికి ఎలాంటి నొప్పి లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు సూదులకు భయపడే వారికి ఇదొక వరం.
ఇలాంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయడం గొప్ప విషయం. నీలోఫర్ ఆసుపత్రి మొదటగా ప్రారంభించడం గర్వకారణంగా మారింది. ప్రస్తుతం ఈ టూల్ వినియోగం మొదటి దశలో ఉన్నా, భవిష్యత్లో ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించే అవకాశం ఉంది. ఏఐ టెక్నాలజీ మానవ జీవితాల్లో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికిందనడంలో ఎలాంటి సందేహం లేదు.