Hyderabad Metro Charges: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. పెంచిన ఛార్జీలు 10శాతం తగ్గింపు

Hyderabad Metro Rail Reduces 10% Charges: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇటీవల పెంచిన ఛార్జీలపై హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో ఛార్జీలను తిరిగి సవరించింది. ఇందులో భాగంగానే పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, తగ్గిన ఈ ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నట్లు తెలిపింది.
కాగా, ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచింది. కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్టంగా రూ.60 నుంచి రూ.75 వరకు పెంచింది. ఇదిలా ఉండగా, మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం సమ్మర్ ఎఫెక్ట్తో మెట్రోకు డిమాండ్ పెరిగింది. అయితే గత కొంతకాలంగా మెట్రో నష్టాల్లో కొనసాగుతోందది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలే ఏకైక మార్గమని పెంచింది.
ఈ మేరకు కనిష్టంగా రూ.2 పెంచగా.. గరిష్టంగా రూ.16 వరకు మెట్రో పెంచింది. తాజాగా, ప్రయాణికుల అభిప్రాయాల మేరకు ఛార్జీలు తగ్గించడంతో ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం కలిగించింది. పెరిగిన ఛార్జీలలోనే 10 శాతం తగ్గిస్తూ ప్రయాణికులకు ఊరటనిచ్చింది.